రక్షకుడు తిరిగి వచ్చిన తరువాత వెయ్యేళ్ల పాలనలో తప్పిపోయినవారికి ఏమి జరుగుతుందో లేఖనం వెల్లడిస్తుంది . . . మరియు అది తండ్రి ప్రేమ యొక్క లోతును తెలుపుతుంది.
|
ప్రేమ ప్రేమను మేల్కొల్పుతుందని సాతానుకు తెలుసు. అందువల్ల, పాపులను వారి సృష్టికర్త నుండి వేరు చేయడానికి అతడి అత్యంత ప్రభావవంతమైన మార్గం వారు ఆయనకు భయపడేలా చేయడం.
పాపులకు ఏమి జరుగును అనే సత్యం లోతైన, సుందరమైన సత్యం, ఇది మునుపెన్నడూ లేని విధంగా, యహువః యొక్క అనంతమైన ప్రేమ యొక్క లోతును తెలుపుతుంది.
తరువాత ఏమి జరుగును?
యహూషువః తిరిగి వచ్చినప్పుడు, రక్షకుని యందు విశ్వాసముంచి మరణించిన వారందరూ పునరుత్థానం చేయబడతారు, మరియు అప్పటికి సజీవులై యున్న నీతిమంతులు “ఒక నిమిషములో, రెప్పపాటులో, కడ బూర మ్రోగగానే” మార్పుచెందెదరు. (1 కొరింథీయులు 15:52).
ప్రశ్న, అప్పుడు: తప్పిపోయిన వారికి ఏమి జరుగుతుంది? క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వారు నాశనమగుదురా?
సత్యం ఆశ్చర్యకరమైనంత అందంగా ఉంది: పరిశుద్ధులు క్రీస్తుతో వెయ్యి సంవత్సరాలు జీవించి, రాజ్యం చేస్తున్నప్పుడు, తప్పిపోయినవారు పశ్చాత్తాపం పొందుటకు చివరి అవకాశం ఉంటుంది.
ఇది మీకు తప్పుడు సిద్ధాంతంగా కనిపిస్తే, చదువుట కొనసాగించండి, ఎందుకంటే ఇది లేఖనాలలో నిరూపించబడింది.
ప్రేమ ఎలా ఉంటుందో చూడండి…
పాత నిబంధన ప్రవక్తలకు యయహువః యొక్క గుణశీలతపై ప్రత్యేకమైన అవగాహన ఉంది. ఎక్కువగా వారి ప్రవచనాలు తిరుగుబాటుచేయువారికి రాబోవుచున్న శిక్షను గూర్చి వ్యవహరించినప్పటికీ, పాపుల పట్ల దైవిక ప్రేమ గురించి కూడా వారికి స్పష్టమైన అవగాహన ఉంది. యిర్మీయా ఇలా ప్రకటించాడు:
యహువః సర్వకాలము విడనాడడు.
ఆయన బాధపెట్టినను,
తన కృపాసమృద్ధినిబట్టి
జాలి పడును.
హృదయపూర్వకముగా ఆయన నరులకు
విచారము నైనను బాధనైనను కలుగజేయడు. (విలాపవాక్యములు 3: 31-33 చూడండి.)
తప్పిపోయిన గొర్రెల ఉపమానంలో పాపుల పట్ల తండ్రి వైఖరిని యహూషువః వివరించాడు: "అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును." (లూకా 15: 7)
యెషయా ద్వారా, యహువః ఇలా ప్రకటించెను:
నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని;
నన్ను వెదకనివారికి నేను దొరికితిని.
నేనున్నాను ఇదిగో నేనున్నాను అని
నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
తమ ఆలోచనల ననుసరించి
చెడుమార్గమున నడచు కొనుచు
లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు
నా చేతులు చాపుచున్నాను. (యెషయా గ్రంథము 65:1,2)
సాధ్యమైనంత ఎక్కువ మంది రక్షింపబడాలని యహువః ఎంతో ఆశపడును. న్యాయం యొక్క తుది అమలుకు ముందు, వెయ్యేళ్ల పాలన చివరిలో, పాపులను రక్షించుటకు ఆయన ఒక ఆఖరి అవకాశాన్ని ఇస్తాడు.
సాతాను 1,000 సంవత్సరాలు బంధింపబడును
మోసపోయి పాపం చేయటం కంటే తెలిసియుండియు పాపం చేయట దారుణంగా ఉంటుంది. అందుకే, అవ్వ మొదట పాపం చేసినప్పటికీ, ఆదాము చేసిన పాపం ఎక్కువ. అవ్వ మోసపోయెను. అయితే, ఆదాము తెలిసి పాపం చేశాడు.
సాతాను యొక్క మోసాల పరిమాణాన్ని యహువః అర్థం చేసుకొనును మరియు పశ్చాత్తాపపడే కొందరు ఉన్నారని [వారి మనస్సులు సత్యాన్ని చూడగలిగితే] ఆయనకు తెలుసు. వెయ్యేళ్ల పాలన ప్రారంభంలో, ఆయన సాతానును బంధిస్తాడు:
మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను. (ప్రకటన గ్రంథము 20:1,2,3)
రూపాంతరం చెందిన పరిశుద్ధులు సాతాను భ్రమల నుండి ఎప్పటికీ విముక్తి పొందుతారు. వారు వారి హృదయాలలో యహువఃను తన ధర్మశాస్త్రాన్ని వ్రాయడానికి అనుమతించుదురు మరియు వారు దైవిక రూపాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తారు. మోసానికి గురయ్యే వ్యక్తులు మాత్రమే ముందుగా సత్యాన్ని తెలుసుకొనుట మరియు అంగీకరించుట నుండి నిరోధించబడుదురు. ఈ విలువైన ఆత్మలు రక్షణను అంగీకరించుటకు వెయ్యేళ్ల పాలన తుది అవకాశాన్ని ఇస్తుంది.
ఏడవ తెగులు సమయంలో సంభవించే విధ్వంసం గురించి యెషయా వివరించాడు:
శాపము దేశమును నాశనము చేయుచున్నది,
దాని నివాసులు శిక్షకు పాత్రులైరి.
దేశనివాసులు కాలిపోయిరి,
శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు. (యెషయా గ్రంథము 24:6)
కొద్దిగానే అనగా ఎవరూ లేరని కాదు. యోహాను నీతిమంతులను "ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చు యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము సమూహం" అని వర్ణించాడు. (ప్రకటన 7: 9) స్పష్టంగా, యెషయాలో పేర్కొన్న “కొద్దిమంది” అనే మాట ఇంకా తుది నిర్ణయం తీసుకోని వ్యక్తులను మాత్రమే సూచిస్తుంది.
ఒక చివరి అవకాశం
ఈ ఆత్మలకు తుది అవకాశాన్ని ఇవ్వడానికి, చివరికి వెయ్యేళ్ల పాలనలో కూడా యహువః చేసిన ప్రయత్నాలను చూపించే అద్భుతమైన ప్రవచనం జెకర్యా 14 లో ఉంది.
మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.
లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యహువఃయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును. ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యహువః వారిని మొత్తును. ఐగుప్తీయులకును, పర్ణశాలపండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికిని రాగల శిక్షయిదే. (జెకర్యా 14:16-19)
బంధించబడి ఉండుటకు మోసం చేసే సాతాను శక్తితో, ఈ కోల్పోయిన ఆత్మలలో కొందరు పశ్చాత్తాపం చెందుతారు, మోక్షాన్ని అంగీకరిస్తారు మరియు కృతజ్ఞతతో, ప్రతి సంవత్సరం పర్ణశాలల పండుగలో యహువఃను ఆరాధించుటకు వెళ్ళుదురు. వెళ్ళుటకు మొండిగా నిరాకరించువారికి, విధేయులకు మాత్రమే లభించే ఆశీర్వాదాలను నిలిపివేయబడతాయయి.
వెయ్యేళ్ల శాంతి అనగా, తప్పిపోయినవారిని చేరుకొనుటకు యాహ్ యొక్క చివరి ప్రయత్నం. ఆయన ఇప్పటివరకు జన్మించిన ప్రతి ఆత్మను కాపాడాలని కోరుకొనును. అనేక మంది మొండిగా మరియు తిరుగుబాటుచేయువారుగా ఉండగా, సాతాను ప్రభావం నుండి విముక్తి పొంది, యహువః ప్రేమను చూసి మోక్షాన్ని అంగీకరించే విలువైన వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. ఒకనిని ఆ మేరకు ప్రేమించినప్పుడు, ప్రతిఫలంగా ప్రేమించకుండా ఎవరు ఉండగలరు?
"మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో(మనకెట్టిప్రేమచూపెనో) చూడుడి." (మొదటి యోహాను 3:1.)
యహూషువః తిరిగి వచ్చిన తరువాత మొదటి వెయ్యి సంవత్సరాల గురించి మరింత సమాచారం కోసం, WLC రేడియోలో The Millennium వినండి!
|