Print

ఎడ్వర్డ్ వైట్‌మన్: ఒక విషాద మరణం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ఎడ్వర్డ్-వైట్మన్-ఒక-విషాద-మరణం

"ఒకవేళ, మరణ పుస్తకాలు మంటల్లో వేయబడితే, సజీవ పుస్తకాలు ఇంకా ఎన్ని ఉంటాయి, అంటే మనుషులు?" 1

ఇది ఆధునిక బైబిల్ విద్యార్ధులకు తెలియని ఎడ్వర్డ్ వైట్‌మన్ కథ, కానీ మత విద్వేషం విషయంలో ఇంగ్లాండ్‌లో చివరిసారిగా సజీవదహనం చేయబడిన వ్యక్తిగా అతడు చరిత్రకు తెలుసు.2 ఇలాంటి అనేక కథల వలె, ఇది కూడా ఆ కాలంలోని మతపర మరియు రాజకీయ వాతావరణం ద్వారా ఆధిపత్యం చేయబడిన కథ, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అన్ని విషయాల మీద ఎడ్వర్డ్ వైట్‌మన్ ను నియంత్రణలో ఉంచుకొనిన మనుషులచే నియంత్రించబడిన వాతావరణం. చాలా మూలాధారాలు వాటి భావనలో "మత ఎడ్వర్డ్ వైట్మన్విబేధం" గల వారిని ఒక రకమైన దెయ్యం పట్టిన, వికృత మనస్సుగల వారిగా చూస్తూ పక్షపాతంతో ఉంటాయి. ఒక గౌరవనీయమైన వ్యాపారవేత్త మరియు సమాజ నాయకుడు అయిన వైట్‌మన్, అతని విశ్వాసం మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో ఆఖరికి ఇంగ్లాండ్ రాజు, జేమ్స్ I దృష్టికి తీసుకురాబడ్డాడు. "డిఫెండర్ ఆఫ్ ది ఫెయిత్" గా జేమ్స్ యొక్క మతపరమైన ఉత్సాహం వైట్‌మన్ ను 1612 లో గుంజపై దహనం చేసేటట్లు తాను చివరిగా మరణశిక్షపై సంతకం చేయునట్లు చేసెను. వైట్‌మన్ తల్లిదండ్రులు స్టాఫోర్డ్‌షైర్‌లోని బర్టన్-అపాన్-ట్రెంట్ ప్రాంతం నుండి వచ్చినవారు. అతడు 1566 లో అక్కడ జన్మించాడు మరియు అక్కడి అనేకమంది నివాసితుల మాదిరిగా సనాతన సాంప్రదాయ పద్ధతిలో బాప్తీస్మం పొందాడు. అతను బర్టన్ వ్యాకరణ పాఠశాలలో విద్యనభ్యసించి తన తల్లి కుటుంబం యొక్క వస్త్ర వ్యాపారంలో ప్రవేశించాడు. 1593 లో అతను ఫ్రాన్సిస్ డార్బీని వివాహం చేసుకున్నాడు.

అతడు ప్యూరిటన్ మతస్థులతో పాలుపంచుకున్నాడు మరియు 1596 లో దెయ్యం పట్టబడిన 13 ఏళ్ల థామస్ డార్లింగ్ పై పరిశోధనకు నియమించబడిన నాయకులలో ఒకరిగా ఎంపికయ్యాడు. ఇది 1590 ల మధ్యలో, వైట్‌మన్ ఒక ముఖ్యమైన మరియు గౌరవనీయమైన ప్రజా ప్రతినిధిగా సూచిస్తుంది. అతడు కొత్తగా ఏర్పడిన ఉద్యమంలో పాల్గొని బర్టన్ సమాజం మరియు రాజకీయాలపై పట్టు సాధించడం ప్రారంభించాడు. డార్లింగ్ కేసులో అతని ప్రమేయం అతని జీవితాన్ని మలుపు తిప్పింది, అది అలా అతడిని మధ్యవర్తిత్వం లేని ఆధ్యాత్మిక జోక్యం యొక్క సంభావ్యతకు పూర్తిగా అనువుగా ఉండేలా చేసింది. డార్లింగ్ ను కేవలం దెయ్యం ఆవహించలేదని, కానీ అతడు "ఆధ్యాత్మిక యుద్ధాల" శ్రేణిలో నియమించబడెనని, దీనిలో అతని నుండి దెయ్యాల మరియు దేవదూతల స్వరాలు వెలువడ్డాయని పేర్కొన్నాడు. ఇది మనం చూడబోతున్నట్లుగా, తరువాత వైట్‌మన్ సనాతన సాంప్రదాయ ధర్మాన్ని గ్రహించిన విధానాన్ని ప్రభావితం చేసింది.

అతడిలో "మత విభేదం" ప్రారంభమవటానికి కారణం ఆత్మ యొక్క మరణాన్ని గూర్చిన అతని అవగాహన కోణం, క్రమంగా అది మరింత సంస్కరణల దిశగా మరియు సాంప్రదాయ విరుద్ధంగా3 మారింది. 1603/4 మరియు 1610/11 మధ్య, అతని ప్రవర్తన మరింత ధైర్యంగా మరియు బిగ్గరగా పెరిగింది. కోర్టు జాబితాల ప్రకారం, అతని రచనలు ఇంకా కనుగొనబడనప్పటికీ, అతడు గొప్ప రచయిత. అతడు స్థానిక సంఘ అధికారుల దృష్టికి తేబడ్డాడు మరియు అతడిని బంధించుటకు ఆదేశాలు జారీ చేయబడెను. ఈ ఉత్తర్వుల ప్రకారం అతడిని బిషప్ రిచర్డ్ నీల్ ముందు వెంటనే విచారణకు తీసుకురావాలని బర్టన్ యొక్క కానిస్టేబుళ్లకు ఆదేశించబడెను.

అతడు తన తదుపరి విచారణ మరియు వాదనల కోసం తన వేదాంతశాస్త్రం యొక్క సంకలనాన్ని రూపొందించుటకు పూనుకున్నాడు. బహుశా తన కేసును వాదించడానికి కనీసం సమయం ఇస్తారని భావించి, మద్దతును పెంచే ప్రయత్నంలో అతడు దాని ప్రతులను మతాధికారులకు అందించాడు. కానీ అప్పుడు, బహుశా చివరి ప్రయత్నంగా, అతడు కింగ్ జేమ్స్ I కి ఒక ప్రతిని అందించాడు, అది చివరికి అతని విధి వ్రాతను ముగిస్తుంది.

జేమ్స్ I 1603 లో ఆంగ్ల సింహాసనం వద్దకు వచ్చాడు, తాను తనను తాను "మతపరమైన ప్రశ్నలకు సమర్థ న్యాయమూర్తి అని భావించి, 'డిఫెండర్ ఆఫ్ ది ఫెయిత్/సత్య సంరక్షకుడు' అనే బిరుదును గొప్పగా పరిగణించాడు." 4 1607 నుండి అతడు రోమన్ కాథలిక్‌ సంరక్షకులతో పాటు విధేయత ప్రమాణం విషయంలో వ్యక్తిగతంగా మరియు అతని వాదనలో వ్రాయడానికి ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పుస్తకాల యొక్క యుద్ధంలో నిమగ్నమై ఉన్నాడు. "సంఘం యొక్క మూడు గొప్ప మతాలైన అపోస్తల్స్, నిసిన్ మరియు అథనాసియన్‌లకు తాను కట్టుబడి ఉండటం ద్వారా కాథలిక్ సనాతన ధర్మాన్ని పరిరక్షించుట అతని యొక్క ప్రధాన అంశాలలో ఒకటి." 5

రాజు యొక్క దృఢమైన వైఖరి గురించి వైట్‌మన్‌కు పూర్తిగా తెలుసు, అయినప్పటికీ అతను తన రాష్ట్రం మరియు సంఘం రెండింటితోనూ పోరాడటానికి ఉద్దేశపూర్వకంగా సిద్ధపడ్డాడు. అందుబాటులో ఉన్న తన వాదన గ్రంథంలోని కొన్ని శకలాలలో, అతడు ఈ సిద్ధాంతాన్ని సూచించినట్లు గమనిస్తాము: "అన్నింటికన్నా ఎక్కువగా యహువఃను ద్వేషించిన మరియు తిరస్కరించిన సిద్దాంతం కోసం మాట్లాడాడు … ఇది సాధారణంగా మూడు విశ్వాసాలు అని పిలువబడే మూడు మానవ ఆవిష్కరణలలో ఉన్న సాధారణ విశ్వాసం.... అవి [అపోస్తల్స్], నిసిన్ మరియు అథనాసియస్ విశ్వాసాలు, ఈ 1600 సంవత్సరాల కాలంలో ఈ విశ్వాసం ప్రపంచంలో ప్రబలంగా ఉంది." 6

వైట్‌మన్‌ క్రైస్తవ సత్యం యొక్క అన్ని అంశాలను ప్రశ్నిస్తూ, "శిశు బాప్తీస్మం హేయమైన ఆచారం అని వాదిస్తూ ... మరియు బాప్తీస్మ సంస్కారం అనేది ఒక వ్యక్తి అవిశ్వాసం నుండి విశ్వాసానికి మార్చబడినప్పుడు తగినంత అవగాహన కలిగిన వయస్సు వచ్చినప్పుడు మాత్రమే నీటిలో జరిగించబడాలని ధృవీకరిస్తూ 7 అతడు సమస్త ఇతర సమూహాల నుండి తనను తాను పూర్తిగా వేరుచేసుకున్నాడు."

కానీ చివరికి అతని ముగింపుకు కారణం ఏమిటంటే, త్రిత్వమును మరియు యహువః స్వభావమును గూర్చిన సిద్ధాంతం నుండి అతని నిష్క్రమణ. చాలావరకు ఈ అంశాల విషయంలో అతడు 325 యొక్క నిసిన్ సిద్ధాంతం మరియు 381 కాన్స్టాంటినోపుల్ యొక్క తదుపరి సిద్ధాంతం యొక్క సూత్రాలను తీవ్రంగా తిరస్కరించాడు. అతడు ఈ సిద్ధాంతాన్ని ఒక కల్పితమని పేర్కొన్నాడు మరియు అతడు క్రీస్తు "కేవలం ఒక జీవి అని మరియు అతడు యహువః కాదని, ఒక వ్యక్తిలో ఉన్న మానవుడని ... [దీనర్థం క్రీస్తు అందరిలాంటి వ్యక్తి అని కాదు కానీ] ఒకే ఒక్క పాపం లేని పరిపూర్ణ వ్యక్తి అని పేర్కొన్నాడు.” 8 కింగ్ జేమ్స్ ఇప్పుడు వైట్‌మన్ కు ఉరిశిక్షను అమలు చేయడంలో ఎప్పుడూ లేనంతగా సిద్ధంగా ఉన్నాడు, ఈ మధ్యగల కాలంలో అతడు స్వదేశంలో మరియు విదేశాలలో మతవిరోధానికి వ్యతిరేకంగా ద్వంద్వ ప్రచారాన్ని ప్రారంభించాడు.

"లెర్న్డ్ డివైన్స్" తో వరుస సమావేశాలు జరిగిన నెలల తర్వాత, చివరకు వైట్‌మన్ చివరిసారిగా బిషప్ నీల్ ముందుకు తీసుకురాబడ్డాడు. వైట్‌మన్ చెప్పిన ప్రకారం, బిషప్ అతనితో "నేను నా అభిప్రాయాలను తిరిగి మార్చుకొనకపోతే మరుసటి రోజు అందరి ముందు నన్ను బర్టన్‌లో కొయ్యకు కట్టి తగలబెడతానని" చెప్పాడు. తుది తీర్పు మరియు ఆరోపణల జాబితాలో "ఎబియాన్, సెరింథస్, వి అలెంటినియన్, అరియస్, మాసిడోనియస్, సైమన్ మాగస్, మనీచీస్, ఫోటోనిస్ మరియు ఇతర మతవిరోధుల మరియు సాతాను యొక్క ప్రవృత్తి ద్వారా జరిగించు ఇతర శాపగ్రస్తమైన అభియోగాలు" ఉన్నాయి.

లిచ్ఫీల్డ్లోని సెయింట్ మేరీస్ చర్చి మరియు మార్కెట్ స్క్వేర్ నేడు ఇలా ఉన్నాయి

లిచ్‌ఫీల్డ్‌లోని సెయింట్ మేరీస్ చర్చి మరియు మార్కెట్ స్క్వేర్ నేడు ఇలా ఉన్నాయి (ఫోటో: పాట్రిక్ కామెర్‌ఫోర్డ్)

అతడిని "పైన పేర్కొన్న నగరానికి దిగువన ఉన్న ఒక జనసందోహం గల బహిరంగ ప్రదేశంలో ఉంచాలని ఆదేశించారు [మరియు] అతడు కాలిపోయే సమయంలో అక్కడున్న ప్రజలు ఆ నేరాన్ని తెలుసుకొని మరియు ఇతర క్రైస్తవులు అదే నేరంలో పడకుండా దానిని ఉదాహరణగా తీసుకోవాలని అలా చేసారు."10

చివరకు అతడిని కొయ్య వద్దకు తీసుకువచ్చినప్పుడు అతని ధైర్యం అంతా అతడిని విడిచిపెట్టింది. మంటలు వెలిగించినప్పుడు, అతడు త్వరగా తప్పును క్షమించమని అరిచాడు, అయినప్పటికీ అప్పటికి అతను "బాగా కాలిపోయాడు." కానీ అతడు అంతటితో ఆగిపోలేదు, ఎందుకంటే రెండు లేదా మూడు వారాల తర్వాత అతడిని మళ్లీ కోర్టుల ముందు ప్రవేశపెట్టారు మరియు ఈసారి మంటల భయానికి భయపడకుండా, మళ్ళీ తిరస్కరించాడు మరియు "మునుపటి కంటే ధైర్యంగా దూషించాడు." రాజు అతడి తుది మరణ శిక్షను త్వరగా ఆదేశించాడు, మరియు ఏప్రిల్ 11, 1612 న, అతడు మరోసారి కొయ్య వద్దకు నడిపించబడ్డాడు.

"[వైట్‌మన్] ని మళ్లీ కొయ్య వద్దకు తీసుకువెళ్లారు, అక్కడ మంటల వేడికి మళ్లీ తప్పును ఒప్పుకుంటాడని అనుకున్నారు, అయితే అతడు అలా చేయనందున అక్కడి అధికారి ఇక ఎక్కువ ఆలస్యం వద్దని చెప్పి కట్టెలు పేర్చబడునట్లు ఆదేశించెను, తరువాత అతడు బూడిద అయ్యేవరకు కాలిపోయాడు." 11

తన మరణశిక్ష జరిగిన తరువాతి నెలల్లో, అనేక మతపరమైన నిరసనకారులు దాదాపు అదే విధికి గురయ్యారు, అయితే 1640-2 లో బిషప్‌ల పతనం మరియు ఉన్నత అధికారం రద్దు చేయబడినప్పటికీ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు రాలేదు. మే 2, 1648 న, దైవదూషణలు మరియు మతవిద్వేషాలకు విధించు శిక్ష విషయంలో చట్టం రూపొందించబడెను.12 అయితే స్వతంత్రులు అలాగే స్వపక్షాల నుండి వ్యతిరేక వలన, ఆ చట్టం ఎప్పటికీ అమలు చేయబడదు. మరియు కేవలం 1677 లో మరొక చట్టం ("మతవిరోధుల సజీవదహనాన్ని నిషేధించిన చట్టం"13) చేయబడిన తరువాత ఇంగ్లాండులో మత బ్రష్టత్వం విషయంలో సజీవదహనం చేయబడిన చివరి వ్యక్తిగా వైట్స్మన్ చరిత్రలో స్థానం నిలుపుకున్నాడు. 1689 లో చేయబడిన సహన చట్టం నేపథ్యంలో దాదాపు 100 సంవత్సరాల తరువాత కొద్దిమంది రచయితలు అతడి విషయాన్ని గూర్చి పేర్కొన్నారు. అతని మరణశిక్షకు తక్షణ ఫలితం దానిని కొద్దిపాటి మంది వ్యతిరేకించుట మాత్రమే, ప్రజాభిప్రాయంలో మార్పు అనేది ఆచరణ విషయంలో సాపేక్ష క్షీణతకు దారితీసి ఉంటుంది.

టొలరేషన్ యాక్ట్, 1689 కి విలియం III తన రాజ సమ్మతిని ఇస్తుండెను

అదే సమయంలో, కింగ్ జేమ్స్ I మత బ్రష్టత్వమును నిర్మూలించే ఈ పద్ధతిపై విశ్వాసం లేనట్లు కనిపిస్తూ, మరియు మత బ్రష్టత్వం ఇంకా బ్రతికే ఉంటుందని సూచిస్తూ, "ఇకపై మతోన్మాదులు, శిక్షించబడినప్పటికీ, వారిని బహిరంగంగా చంపడానికి బదులుగా [వారిని అమరవీరులుగా చూసేవారు రంజింపజేయబడే ప్రమాదం ఉంది] చనిపోయే వరకు నిశ్శబ్దంగా, ప్రత్యేకంగా చెరసాలలో ఉంచుటకు బహిరంగ ప్రాధాన్యతనిచ్చాడు." 14


1 ‘మత్తీయు ఓరీ, పారిస్, 1544 ఫ్రాన్స్ సామ్రాజ్యం యొక్క మతవిరోధ విషయాల యొక్క విచారణాధికారి.’ లారెన్స్ గోల్డ్‌స్టోన్, నాన్సీ గోల్డ్‌స్టోన్, అవుట్ ఆఫ్ ది ఫ్లేమ్స్, బ్రాడ్‌వే, 2003.

2 మూడు వారాల ముందు లండన్‌లో దహనం చేయబడిన మరొక త్రిత్వ సైద్ధాంతీకుడు మరియు మతోన్మాది, బార్తోలోమ్యూ లెగేట్ అనే నిందితుడిని సంక్షిప్తంగా తొలగించడం.

3 తన తొలి బహిరంగ సందేశంలో అతడు "మనుష్యుల ఆత్మ శరీరంతో మరణిస్తుంది మరియు అది సాధారణ తీర్పు దినం వరకు స్వర్గం యొక్క సంతోషాలలో లేదా నరకం యొక్క బాధలలో పాల్గొనదు, కానీ అప్పటి వరకు శరీరంతో విశ్రాంతి తీసుకుంది" అని పేర్కొన్నాడు. MW గ్రీన్స్‌లేడ్, 'ది 1607 రిటర్న్ ఆఫ్ స్టాఫోర్డ్‌షైర్ క్యాథలిక్,' స్టాఫోర్డ్‌షైర్ కాథలిక్ హిస్టరీ, 4, 1963-4, p 6–32; క్లార్క్, లైవ్స్ ఆఫ్ టూ అండ్ ట్వంటీ ఇంగ్లీష్ డివైన్స్, p. 147.

4 ఎర్ల్ మోర్స్ విల్బర్, ఏ హిస్టరీ ఆఫ్ యూనిటేరియనిజం, హార్వర్డ్, 1945, p. 177.

5 F. శ్రీవర్, ‘ఆర్థోడాక్సీ అండ్ డిప్లొమసీ: జేమ్స్ I అండ్ వోర్షియస్ ఎఫైర్,’ అంటే, lxxxv, 1970, పేజీ 453-4; జేమ్స్ VI అండ్ నేను, ది వర్క్స్ ఆఫ్ ది మోస్ట్ హై మరియు మైటీ ప్రిన్స్, ఐయామ్స్ బై గ్రేస్ ఆఫ్ యహువః, గ్రేట్ బ్రిటన్ కింగ్, లండన్, 1616, పేజీ 302.

6 బోడ్లియన్ లైబ్రరీ, ఎంఎస్ అష్మోల్, బర్తోలోమ్యూ లెగేట్ మరియు థామస్ వైట్‌మన్ ను శిక్షించటం మరియు దహనం చేయుట కోసం కమిషన్‌లు మరియు వారెంట్ల యొక్క నిజమైన సంబంధం, 1521 B, 7, 1a–1b, London, 1651, పేజీ 8.

7 ఐబిడ్., P 8-9, 23.8 ఐబిడ్., పేజీ 5.9 లింకన్‌షైర్ ఆర్కైవ్స్ ఆఫీస్, D&C, Ciij/13/1/2/2, fo. 1 ఆర్.

8 ఐబిడ్., పి 5.9 లింకన్‌షైర్ ఆర్కైవ్స్ ఆఫీస్, డి & సి, సియిజ్/13/1/2/2, ఫో. 1 ఆర్.

10 రాబర్ట్ వాలెస్, యాంటీట్రినిటేరియన్ బయోగ్రఫీ, E. T. వైట్‌ఫీల్డ్, 1850, పేజీలు. 567-568.

11 జార్జ్ బిర్క్‌హెడ్, మైఖేల్ సి. క్వెస్టియర్, యొక్క న్యూస్‌లెటర్స్ ఫ్రం ది ఆర్చ్‌ప్రెస్‌బిటరేట్ ఆఫ్ జార్జ్ బిర్క్‌హెడ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1998, పేజీ. 153.

12 "ప్రధానంగా త్రిత్వ యహువః, పునరుత్థానం, చివరి తీర్పు, మరియు బైబిల్ అనగా యహువః యొక్క వాక్యం మొదలైన విషయాల్లో విబేధిస్తే ... మతాధికారుల ప్రయోజనం లేకుండా మరణానికి తగిన నేరంగా పరిగణించబడుతుంది" (ఫెలిక్స్ మాకోవర్, రాజ్యాంగ చరిత్ర మరియు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క రాజ్యాంగం, అయర్, 1972, పే. 193).

13 1790 వరకు ఇంగ్లాండ్‌లోని శాసనం పుస్తకంలో కొయ్యకు కట్టి దహనం చేయుట ఉంది, తన భర్తను హత్య చేసిన మహిళకు శిక్షగా సజీవదహన శిక్ష అమలు చేసినప్పటి వరకు.

14 A. J. లూమీ, స్పెయిన్ మరియు ది ఎర్లీ స్టూవర్ట్స్ 1585-1655, ఆల్డర్‌షాట్, 1996, ch. 10.